Home » National
దేశంలోనే అత్యంత ధనవంతమైన మహిళగా పేరు పొందిన సావిత్రి జిందాల్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. ఆమె కుమారుడు, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ ఈ మధ్యే కాంగ్రెస్ని వీడి బీజేపీలో చేరారు. బీజేపీ ఆయనకు కురుక్షేత్ర నుంచి లోక్ సభ ఎన్నికలకు టికెట్ కేటాయించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై అమెరికా విదేశాంగ శాఖ చేసిన కామెంట్స్కి వ్యతిరేకంగా భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో కీలక వ్యాఖ్యలు చేసింది.
బాలీవుడ్ నటుడు గోవిందా ఏక్నాథ్ షిండే నేతృత్వంలో గల శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత షిండే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్ సభ సీటు నుంచి గోవిందా బరిలోకి దిగే అవకాశం ఉంది.
అమరావతి లోక్సభ బీజేపీ అభ్యర్థిగా నవనీత్ కౌర్ (Navneet Rana) ప్రకటించడాన్ని షిండే వర్గానికి చెందిన శివసేన సీనియర్ నేత ఆనందరావు అడ్సల్ (Anandrao Adsul) తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె మృత్యు బావిలోకి వస్తుందన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కస్టడీని పొడగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరో నాలుగు రోజులు కస్టడీ పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ సందర్భంగా కోర్టులో కేజ్రీవాల్ ఉద్వేగభరిత ప్రసంగం చేసినట్లు తెలుస్తోంది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, గురుప్రీత్ కౌర్ దంపతుల ఇంట మహాలక్ష్మి జన్మించింది. వారికి గురువారం పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని సీఎం మాన్ తన ఎక్స్ అకౌంట్లో పంచుకున్నాడు.
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మరో షాక్ తగిలింది. మరో నాలుగు రోజుల పాటు.. అంటే ఏప్రిల్ 1వ తేదీ వరకూ కేజ్రీవాల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజా ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
బీహార్లో కూటమి సీట్ల లెక్క తేలడం లేదు. భాగస్వామ్య పక్షాల మధ్య ఒప్పందం కొలిక్కి రాకముందే రాష్ట్రీయ జనతా దళ్ తన అభ్యర్థులను ప్రకటించింది. కొందరికి టికెట్లను కూడా అందజేసింది. దీంతో అక్కడ కూటమి పోటీ చేసే స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంతలో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి మరో ఆఫర్ ఇచ్చారు.
Lok Sabha Elections 2024: త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) పోటీ చేసేందుకు తన వద్ద డబ్బుల్లేవని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman) అన్నారు. గురువారం నాడు కేరళలో(Kerala) పర్యటించిన ఆమెను..
హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హిస్సార్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ.. దశాబ్దం పాటు ప్రజలకు సేవా చేశానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.