తల్లిని చంపిన కుమారుడికి జీవితఖైదు
ABN , First Publish Date - 2020-10-29T11:51:51+05:30 IST
డబ్బుల కోసం తల్లిని హత్య చేసిన కుమారుడికి జీవితఖైదుతో
హైదరాబాద్/ఎల్బీనగర్: డబ్బుల కోసం తల్లిని హత్య చేసిన కుమారుడికి జీవితఖైదుతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు 14వ ఆదనపు సెషన్స్ జడ్జి కె.సుదర్శన్ తీర్పునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండలో నివాసముండే కుంచర్ల కొండమ్మ ఏపీలోని కందుకూరు గ్రామంలో ఆస్తిని అమ్మి కొడుకులకు పంచి ఇచ్చింది. కొండమ్మ వద్ద లక్ష రూపాయలు ఉంచుకుంది. మద్యానికి బానిసైన కొడుకు కొండయ్య తల్లి దాచుకున్న లక్ష రూపాయలు దొంగిలించి హత్య చేశాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన జడ్డి సుదర్శన్ నిందితుడికి జీవితఖైదుతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.