క్షుద్రపూజల కలకలం..ముగ్గులు వేసి..
ABN , First Publish Date - 2020-10-29T18:12:02+05:30 IST
క్షుద్రపూజల కలకలం..ముగ్గులు వేసి..
పశ్చిమగోదావరి: జిల్లాలోని కుక్కునూరు మండలం పాత దాచవరంలో క్షుద్రపూజల కలకలం రేగింది. ఇళ్ల నిర్మాణం కోసం సేకరించిన స్థలంలో గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గులు వేసి పూజలు చేశారు. గిరిజన ప్రాంతం కావడంతో స్థానికులు తీవ్ర కలవరం చెందుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.