రాజకీయ లబ్ది కోసమే బూటకపు జలవివాదం: ఆలపాటి రాజా
ABN, First Publish Date - 2021-07-02T19:22:45+05:30
రాజకీయ లబ్ది కోసమే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ఆరాటమని మాజీ మంత్రి ఆలపాటి రాజా పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు తెరపైకి జల వివాదమన్నారు.
అమరావతి: రాజకీయ లబ్ది కోసమే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ఆరాటమని మాజీ మంత్రి ఆలపాటి రాజా పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు తెరపైకి జల వివాదమన్నారు. తెలంగాణ మంత్రులు రెచ్చగొడుతున్నా.. ఏపీ మంత్రులు నోరు మెదపడం లేదన్నారు. ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు.. పక్క రాష్ట్ర మంత్రులకు సమాధానం చెప్పే ధైర్యం లేదా? అని ప్రశ్నించారు. అక్కడ మన వాళ్లు ఉన్నందునే తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమనలేకపోతున్నామంటూ.. జగన్ రాష్ట్రం పరువు తీస్తున్నారని ఆలపాటి రాజా పేర్కొన్నారు.
Updated Date - 2021-07-02T19:22:45+05:30 IST