ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబైలో విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌

ABN, First Publish Date - 2022-12-03T04:08:28+05:30

ముంబైకి చెందిన ఓ మైనర్‌ బాలిక(13) తన తరగతి గదిలోనే సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమెతో కలిసి ఎనిమిదో తరగతి చదువుతున్న నలుగురు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తరగతి గదిలోనే దారుణానికి ఒడిగట్టిన సహచర విద్యార్థులు

ముంబై, డిసెంబరు 2 : ముంబైకి చెందిన ఓ మైనర్‌ బాలిక(13) తన తరగతి గదిలోనే సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమెతో కలిసి ఎనిమిదో తరగతి చదువుతున్న నలుగురు సహచర విద్యార్థులు (13-14 ఏళ్ల లోపు వారు) ఈ దారుణానికి ఒడిగట్టారు. తరగతి గదిలో ఒంటరిగా ఉన్న బాలికపై ఓ బాలుడు అత్యాచారం చేయగా, మరో బాలుడు లైంగిక దాడి చేశాడు. మరో ఇద్దరు బయట కాపలా కాశారు. ముంబై, మాతుంగ ప్రాంతంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు శుక్రవారం వెల్లడించారు. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులంతా భవనం మొదటి అంతస్థులో సమావేశమయ్యారు. ఆ సమయంలో తరగతి గదిలో ఒంటరిగా ఉన్న బాలికపై ఇద్దరు నిందితులు దారుణానికి పాల్పడ్డారు. ఇంటికెళ్లిన బాలిక జననాంగాల్లో నొప్పిగా ఉందని తల్లికి చెప్పడంతో ఘోరం వెలుగు చూసింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసి జువెనైల్‌ హోమ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Updated Date - 2022-12-03T04:08:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising