ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉమ్మడి జిల్లా ఎక్సైజ్‌ డీసీగా శ్రీనివాసరావు

ABN, Publish Date - Sep 26 , 2024 | 12:57 AM

ఉమ్మడి కృష్ణా జిల్లా ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్‌గా టి.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఎస్‌ఈబీ ప్రధాన కార్యాలయంలో పనిచేసి, ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న ఆయనకు విజయవాడలో డీసీగా పోస్టింగ్‌ ఇచ్చారు. జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌గా వై.శ్రీనివాస చౌదరిని నియమించారు.

విజయవాడ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి కృష్ణా జిల్లా ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్‌గా టి.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఎస్‌ఈబీ ప్రధాన కార్యాలయంలో పనిచేసి, ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న ఆయనకు విజయవాడలో డీసీగా పోస్టింగ్‌ ఇచ్చారు. జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌గా వై.శ్రీనివాస చౌదరిని నియమించారు. ఎక్సైజ్‌ శాఖ ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్‌ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్న ఆయనకు ఇక్కడ పోస్టింగ్‌ ఇచ్చారు. ఎస్‌ఈబీని రద్దు చేసి ఎక్సైజ్‌ శాఖలో విలీనం చేసిన తర్వాత రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలకు పూర్వం ఉన్నట్టుగానే ఒక డిప్యూటీ కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ను నియమించారు. ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్‌జిల్లా, కృష్ణాజిల్లాకు కలిపి ఒక డిప్యూటీ కమిషనర్‌, ఒక అసిస్టెంట్‌ కమిషనర్‌ ఉంటారు. ఈ ఇద్దరు అధికారులు విజయవాడ కేంద్రంగానే విధులు నిర్వర్తిస్తారు. విజయవాడలో డిస్టలరీస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఉన్న జి.మునిస్వామిని అనంతపురం జిల్లా ఏసీగా బదిలీ చేశారు. విజయవాడలో ఏపీఎ్‌సబీసీఎల్‌ జోనల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న బి.స్వాతిని విజయవాడ డిస్టలరీస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. విజయవాడలోని ఏపీఎ్‌సబీసీఎల్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న టి.శ్రీనివాసరావును నెల్లూరు జిల్లా డీసీగా బదిలీ చేశారు. విజయవాడలో ఎస్‌ఈబీ డీసీగా పనిచేసి, వెయిటింగ్‌లో ఉన్న ఎం.శంకరయ్యను ఎక్సైజ్‌ శాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఎన్టీఆర్‌ జిల్లాలో డీపీఈవోగా ఉన్న బి.శ్రీనాధుడిని విజయనగరం జిల్లాకు బదిలీ చేశారు. పాడేరులో ఎస్‌ఈబీ ఈఎ్‌సగా పనిచేసి వెయిటింగ్‌లో ఉన్న సిరిగినీడి శ్రీనివాసరావు ఎన్టీఆర్‌ జిల్లా డీపీఈవోగా నియమించారు. కృష్ణా జిల్లా డీపీఈవోగా ఉన్న ఎ.అవులయ్యను ఏలూరు జిల్లాకు బదిలీ చేశారు. కృష్ణా జిల్లా ఎస్‌ఈబీ ఈఎ్‌సగా పనిచేసి వెయిటింగ్‌లో ఉన్న జి.గంగాధరరావును జిల్లా డీపీఈవోగా నియమించారు.

కృష్ణాజిల్లా ఎకై్ౖసజ్‌

సూపరింటెండెంట్‌గా గంగాధరరావు

మచిలీపట్నం(ఆంధ్రజ్యోతి) : కృష్ణాజిల్లా మచిలీపట్నం ఎకై్ౖసజ్‌ విభాగం సూపరింటెండెంట్‌గా జి.గంగాధరరావును నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముకే్‌షకుమార్‌మీనా ఉత్తర్వులు జారీచేశారు. గతంలో కృష్ణా ఎస్‌ఈబీ ఈఎ్‌సగా పనిచే సిన అయన కొంతకాలంగా పోస్టింగ్‌కోసం ఎదురుచూస్తున్నారు. మచిలీపట్నం డీఎస్పీ అబ్ధుల్‌ సుభాన్‌ బదిలీఅయ్యారు. ఆయనను సీఐడీ విభాగం డీఎస్పీగా బదిలీచేశారు.

Updated Date - Sep 26 , 2024 | 12:57 AM