Share News

Narayana: వైసీపీ అరాచ‌క పాల‌న‌ని త‌రిమికొట్టాలి

ABN , Publish Date - Mar 21 , 2024 | 08:32 PM

తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో అధికారంలోకి వ‌చ్చిన తర్వాత జ‌న‌సైనికుల‌కి తగిన గౌర‌వం ఇస్తామని మాజీ మంత్రి నారాయణ (Narayana) అన్నారు. గురువారం నాడు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు వేమిరెడ్డి, నారాయణ, బీదా రవిచంద్ర, జనసేన పార్టీ నేత మనుక్రాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Narayana: వైసీపీ అరాచ‌క పాల‌న‌ని త‌రిమికొట్టాలి

నెల్లూరు: తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో అధికారంలోకి వ‌చ్చిన తర్వాత జ‌న‌సైనికుల‌కి తగిన గౌర‌వం ఇస్తామని మాజీ మంత్రి నారాయణ (Narayana) అన్నారు. గురువారం నాడు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు వేమిరెడ్డి, నారాయణ, బీదా రవిచంద్ర, జనసేన పార్టీ నేత మనుక్రాంత్ రెడ్డి పాల్గొన్నారు. మొదటిసారి సిటీ నియోజకవర్గం నుంచి జనసేన కార్యాలయానికి నారాయణ వెళ్లారు. జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాయని చెప్పారు. సిటీతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అరాచ‌క పాల‌న‌ని త‌రిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని నారాయణ చెప్పారు.

స‌మ‌న్వయంతో ప‌నిచేస్తాం: మ‌నుక్రాంత్ రెడ్డి

ఈ ఎన్నిక‌ల్లో అంద‌రూ స‌మ‌న్వయంతో ప‌నిచేస్తామని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మ‌నుక్రాంత్ రెడ్డి(Manukrant Reddy) అన్నారు. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ - జ‌న‌సేన - బీజేపీ ఉమ్మడి కూట‌మితో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ఖాయ‌మన్నారు. వేమిరెడ్డి ప్రభాక‌ర్‌రెడ్డి ప్రజా సేవ‌కుడని ఆయ‌న ఎన్నో దైవ‌, సేవా కార్యక్రమాలు చేస్తుంటారని చెప్పారు. ఈ ఎన్నిక‌ల్లో ఎంపీగా వేమిరెడ్డిని, ఎమ్మెల్యేగా నారాయ‌ణ‌ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మ‌నుక్రాంత్ రెడ్డి అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2024 | 10:20 PM