ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజా దోచిందంతా కక్కిస్తా
ABN, Publish Date - Sep 29 , 2024 | 06:02 AM
క్రీడాశాఖ మంత్రిగా రోజా దోచేసిన మొత్తాన్ని కక్కిస్తానని శాప్ చైౖర్మన్ రవినాయుడు అన్నారు. రవి నాయుడికి పదవి వచ్చిన సందర్భంగా శనివారం తిరుపతిలో టీడీపీ, తెలుగు యువత శ్రేణులు
శాప్ చైర్మన్ రవినాయుడు
తిరుపతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): క్రీడాశాఖ మంత్రిగా రోజా దోచేసిన మొత్తాన్ని కక్కిస్తానని శాప్ చైౖర్మన్ రవినాయుడు అన్నారు. రవి నాయుడికి పదవి వచ్చిన సందర్భంగా శనివారం తిరుపతిలో టీడీపీ, తెలుగు యువత శ్రేణులు తిరుపతిలో భారీర్యాలీ నిర్వహించాయి. ఆయన మాట్లాడుతూ... ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయల డబ్బును రోజాతో పాటు అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దోచేశారని ఆరోపించారు. రోజాతో పాటు బైరెడ్డిని జైలుకు పంపిస్తామన్నారు.
Updated Date - Sep 29 , 2024 | 06:02 AM