Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Sep 29 , 2024 | 08:51 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-09-29T19:54:47+05:30
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్లో వర్షం
నాంపల్లి, లక్డీకపూల్, మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్లో వర్షం
షేక్ పేట్, మెహదీపట్నం, టోలిచౌకి, గోల్కొండలో వాన
గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్లోనూ వర్షం
నగరవ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
జలమయమైన నగర రోడ్లు..
ఖైరతాబాద్, ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ల కింద నిచిపోయిన వర్షపు నీరు
మరో గంట పాటు నగరానికి భారీ వర్ష సూచన
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ హెచ్చరిక
మాన్సూన్ బృందాలను సిద్ధం చేసిన బల్దియా
-
2024-09-29T19:06:36+05:30
పాత బస్తీ బండ్లగూడలో ముజ్రా పార్టీని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
నలుగురు ట్రాన్స్జెండర్లతో పాటు 8 మంది యువకులు సహా మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బండ్లగూడ గౌస్నగర్లోని లేక్వ్యూ హిల్స్లో కాంపౌండ్వాల్తో కూడిన ప్లాట్లో గుట్టు చప్పుడు కాకుండా ముజ్రా పార్టీ
పక్కా సమాచారంతో రైడ్ చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు
బండ్లగూడలోని లేక్ వ్యూ హిల్స్ గౌస్ నగర్లో కాంపౌండ్ వాల్ ఉన్న ప్లాట్లో ముజ్రా పార్టీ ఏర్పాటు
8 మంది యువకులు అశ్లీల నృత్యాలు చేస్తున్నట్టు గుర్తింపు
నలుగురు ట్రాన్స్జెండర్లు అసభ్యకరంగా పెద్దపెద్ద శబ్దాలతో డాన్సులు చేస్తున్నట్లు గుర్తించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
యాంప్లిఫైయర్-1, లౌడ్ స్పీకర్ -1, ఒక సౌండ్ బాక్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
-
2024-09-29T18:10:18+05:30
తిరుమల లడ్డూ వ్యవహారంపై గుడివాడ అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు
తిరుపతి లడ్డూను కూటమి నేతలు రాజకీయం చేస్తున్నారన్న మాజీ మంత్రి
అందుకే నిన్న వైసీపీ నేతలు పూజలు నిర్వహించారు
ఇచ్చిన హామీలు అమలు చేయలేక ... లేనిపోనవి ప్రచారం చేస్తున్నారు
డైవర్ట్ రాజకీయాల కోసమే తిరుపతి లడ్డూను వివాదంలోకి తీసుకువచ్చారు
టీడీపీ మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం ఉంది
విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించక పోతే మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పాలి
తిరుమల లడ్డూపై సీబీఐ విచారణను కూటమి నేతలు ఎందుకు కోరడం లేదు?
లడ్డూ కాదు... కూటమి ప్రభుత్వం అపవిత్రం అయ్యింది
మాకు సిట్ల మీద నమ్మకం లేదు
ఈ విషయంలో సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం
లిక్కర్ షాపులు రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది
తిరుపతిలో అత్యధికంగా మద్యం షాపులు కేటాయించడాన్ని ఏమనుకోవాలి?
రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి... రాష్ట్రంలో సినిమా పోలీసులు వ్యవస్థ ఉంది
-
2024-09-29T17:33:57+05:30
లులూ గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ కీలక ట్వీట్
ఏపీ రాజధాని అమరావతిలో మాకు ఆహ్వానం పలికిన మీకు ధన్యవాదాలు
మీకు, నాకు మధ్య సోదరబంధం 18 సంవత్సరాలుగా కొనసాగుతోంది
సీఎంగా ఉన్న మీతో (చంద్రబాబు) జరిపిన చర్చలు చాలా ఫలవంతం అయ్యాయి
అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్, ఎనిమిది స్క్రీన్ల ఐమ్యాక్స్ మల్టిప్లెక్స్ను విశాఖలో ప్రారంభించాలని నిర్ణయించాం
విజయవాడలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హైపర్ మార్కెట్ను, తిరుపతిలో లాజిస్టిక్ సెంటర్లతో పాటు మోడ్రన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తాం
ట్విటర్ వేదికగా ప్రకటించిన లులూ గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ
-
2024-09-29T17:15:36+05:30
లులూ గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ కీలక ట్వీట్
ఏపీ రాజధాని అమరావతిలో మాకు ఆహ్వానం పలికిన మీకు ధన్యవాదాలు
మీకు, నాకు మధ్య సోదరబంధం 18 సంవత్సరాలుగా కొనసాగుతోంది
సీఎంగా ఉన్న మీతో (చంద్రబాబు) జరిపిన చర్చలు చాలా ఫలవంతం అయ్యాయి
అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్, ఎనిమిది స్క్రీన్ల ఐమ్యాక్స్ మల్టిప్లెక్స్ను విశాఖలో ప్రారంభించాలని నిర్ణయించాం
విజయవాడలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హైపర్ మార్కెట్ను, తిరుపతిలో లాజిస్టిక్ సెంటర్లతో పాటు మోడ్రన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తాం
ట్విటర్ వేదికగా ప్రకటించిన లులూ గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ
-
2024-09-29T16:40:59+05:30
తిరుపల్లి లడ్డూ వ్యవహారం.. ఢిల్లీలో తెలుగు విద్యార్థుల నిరసన ర్యాలీ
తిరుపతి లడ్డూ ప్రసాద కల్తీకి వ్యతిరేకంగా ఢిల్లీలో తెలుగు విద్యార్థుల నిరసన ర్యాలీ
సనాతన ధర్మ విలువల పరిరక్షణకు మద్దతుగా పాదయాత్ర చేపట్టిన ఆలిండియా తెలుగు స్టూడెంట్స్ అండ్ యూత్ అసోసియేషన్
ఢిల్లీ గోల్ మార్కెట్లోని టీటీడీ ఆలయం నుంచి ఏపీ భవన్ వరకు విద్యార్థుల ర్యాలీ
టీటీడీ ఆలయానికి దిష్టి తీసి కొబ్బరికాయలు కొట్టిన విద్యార్థులు
తెలుగు విద్యార్థుల ర్యాలీ నేపథ్యంలో టీటీడీ ఆలయం, ఏపీ భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
లడ్డూ ప్రసాద కల్తీ అంశంపై సీబీఐతో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసిన తెలుగు విద్యార్థులు
ఆలయాల పర్యవేక్షణలో ప్రభుత్వ జోక్యం ఉండరాదని, పీఠాధిపతులు, పండితులకు ఆలయాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాల డిమాండ్లు
ప్రసాదం కల్తీ అంశంపై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని అభ్యర్థన
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, కరుణాకార్ రెడ్డి, ధర్మారెడ్డిపై సీబీఐ దర్యాప్తు జరపాలి
ప్రసాదం కల్తీకి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆల్ ఇండియా తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్
-
2024-09-29T16:10:41+05:30
విజయవాడలో విషాదం
స్క్రూ బ్రిడ్జి వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి బందర్ కాలువలో దూకిన తల్లి
సంవత్సరంలోపు వయసుగల ఆడపిల్లను వెలికి తీసిన స్థానికులు
హాస్పిటల్కు తరలించే లోపే చనిపోయిన పసిపాప
తల్లి, కుమారుడు కోసం కొనసాగుతున్న గాలింపు
-
2024-09-29T15:56:15+05:30
మంగళగిరిలో క్లీన్ అండ్ గ్రీన్కు మంత్రి నారా లోకేష్ చర్యలు
సొంతంగా కార్మికులను నియమించి గడ్డి తొలగింపు చర్యలు తీసుకున్న మంత్రి నారా లోకేష్
సొంతంగా 5 గడ్డి తొలగింపు మిషన్ల కొనుగోలు చేయడంతో పాటు ప్రతి నెల కార్మికులకు జీతాలు చెల్లించనున్న మంత్రి
నియోజకవర్గంలో రోడ్లకు ఇరువైపుల ఉన్న గడ్డి, పిచ్చి మొక్కలు తొలగింపు
నేటి నుంచి గడ్డి తొలగింపు కార్యక్రమం
లోకేష్ చూపిస్తున్న చొరవ పట్ల స్థానికుల హర్షం
-
2024-09-29T15:46:18+05:30
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పార్థివ దేహానికి మాజీ మంత్రుల నివాళులు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి కన్నుమూత
పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్ గౌడ్, డాక్టర్ సంజయ్
ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీమంత్రి హరీష్ రావు
ధైర్యంగా ఉండాలని చెప్పిన హరీశ్ రావు
-
2024-09-29T15:42:17+05:30
వైఎస్ జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు
2014-19 ఐదేళ్ళ పాలనలో పేదల కల నెరవేరాలన్న ఉద్దేశంతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టాం
మనం నిర్మించిన ఇళ్లను పూర్తి చేయకుండా ఇళ్లకు రంగులు మాత్రం వేసుకున్నారు
ఐదేళ్లపాటు జగన్ పాలనలో ఎన్నో ఉద్యమాలు చేశాం
ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లకు పూర్వ వైభవం తీసుకురావడం కోసం మా ప్రయత్నం
ఇళ్ల లబ్ధిదారులను బలవంతంగా రుణగ్రస్తులను చేశాడు
పది శాతం పెండింగ్ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అతి త్వరలో ఇళ్లను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం
ఒక్క పాలకొల్లులోనే రూ.150 కోట్లు ఇళ్లు తాకట్టుపెట్టి పక్క దారి పట్టించారు
పీకల్లోతు నీళ్ళలో కొంతమంది పేదలకు సెంటు పట్టాలు ఇచ్చారు
ఐదేళ్లలో ప్రభుత్వమే ఆ స్థలాలను పూడ్చలేకపోయింది
చంద్రమండలంపైకి వెళ్లొచ్చేమో కానీ జగన్ ఇచ్చిన సెంటు స్థలాల వద్దకు వెళ్లలేం
రాష్ర్ట విభజన కంటే జగన్ పాలన వల్ల ఎక్కువ నష్టం జరిగింది
ప్రపంచ స్థాయిలో మళ్ళీ అమరావతిని తిరిగి నిలబెట్టేందుకు మంత్రి నారాయణ కృషి చేస్తారు.
-
2024-09-29T13:30:00+05:30
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై రెక్కీ
నా మీద రెక్కీ చేయడం కోసం ఇద్దరు వ్యక్తులు తిరుగుతున్నారు
స్థానికులు గమనించి లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు
నా ఇంటి చుట్టూ రెక్కీ చేసి ముంబైలో కొందరికి సమాచారం చేరవేస్తున్నారు
ఈ అంశాన్ని పోలీసులు సీరియస్గా తీసుకోవాలి
ఇలాంటి వాటికి నేను భయపడను: రాజా సింగ్
-
2024-09-29T12:00:02+05:30
అమరావతి: స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు
రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ జీవో విడుదల
వారం రోజుల్లో జీవో విడుదల చేస్తామని సీఐఐ సదస్సులో మంత్రి లోకేశ్ హామీ
ఇచ్చిన మాట ప్రకారం జీవో ఇప్పించిన మంత్రి నారా లోకేశ్
-
2024-09-29T11:58:00+05:30
టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు
తిరుపతి: లడ్డూ కల్తీ, సిట్ ఏర్పాటుపై టీజీ వెంకటేశ్ సంచలన కామెంట్స్
కుళ్లిపోయిన జంతు కొవ్వు నార్త్ ఇండియాలో ఎక్కువ దొరుకుతుంది
విదేశాలకు సోపు సరఫరా చేయాలంటే జంతు కొవ్వు కలపలేదు అని డిక్లరేషన్ ఇవ్వాలి
విదేశీ వినియోగదారులకు సోపు పంపాలంటే ఇన్ని ఆంక్షలు ఉంటాయి
అలాంటపుడు నెయ్యిలో కల్తీ కాకుండా ఎంత కట్టుదిట్టమైన చర్యలు ఉండాలి
వనస్పతి అంటే కూడా రైస్ ఆయిల్, జంతువుల ఆయిల్ కూడా కలుస్తుంది
కేసు పెట్టాలంటే.. కల్తీ జరిగిదంటే చాలు.. జంతు కొవ్వు ఉందా లేదా అనేది అనవసరం. కల్తీ జరిగిందనేది నిజం... మరో ఆలోచన లేదు
నెయ్యి ప్యూర్గా లేకుండా ఏది కలిపినా కల్తీ అయినట్టే... శిక్ష ఒక్కటే
హత్య చేసేపుడు కత్తి అయినా, తుపాకి అయినా ఒక్కటే
కల్తీ అయ్యింది. కేసు పెట్టేసి, వేరే అంశాలపై ప్రభుత్వం ద్రుష్టి పెడితే మంచిది
సీఎం ఎప్పుడూ విద్యార్థిగానే ఉండాలి.
లడ్డూ క్వాలిటీ బాగలేదని భక్తులు ఎన్నో సార్లు ఫిర్యాదు అయితే చేస్తూనే ఉన్నారు
రాజులు, వారి పెట్టిన సామంతరాజులు సరిగ్గా ఉంటే ఇవ్వన్నీ జరిగి ఉండదు
సిట్ పైన వారికి నమ్మకం లేకపోతే, సీబీఐపైన కూడా వారికి లేదు. అందుకే వారు గతంలో వారి కేసుల్లో సీబీఐకి కూడా సహకరించలేదు
టీటీడీ పాలకమండలికి మాలాంటి వారు అనర్హులం : టీజీ వెంకటేశ్
హైడ్రా బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి.
అసైన్డ్ భూములను అమ్మిన వారు, వాటిని రిజిస్త్రేషన్ చేసిన రిజిస్టర్, రెవిన్యూ అధికారులు అందరిపైన చర్యలు తీసుకోవాలి
-
2024-09-29T10:19:19+05:30
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృ వియోగం
హైదరాబాద్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి కన్నుమూత
సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు
పురుషోత్తమ్ రెడ్డి మృతిపై సీఎం రేవంత్ సంతాపం
-
2024-09-29T09:00:38+05:30
బ్రిడ్జీ నిర్మాణంపై రాజకీయ రగడ
హనుమకొండ:నయీంనగర్ బ్రిడ్జీ నిర్మాణంపై రాజకీయ రగడ
బ్రిడ్జీ తమ హయాంలో శాంక్షన్ ఇచ్చామంటోన్న మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక శాంక్షన్ ఇచ్చి నిర్మించామంటోన్న వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
వినయ్ భాస్కర్ ఈ రోజు ఉదయం 9:30కు చర్చకు రావాలని సవాల్
-
2024-09-29T08:57:24+05:30
ఛత్తీస్ గఢ్లో బాంబ్ పేలుళ్లు
బీజాపూర్ జిల్లాలో ఐఈడీ పేలుళ్లు
మావోయిస్ట్లు అమర్చిన ఐఈడీ
ఐఈడీ పేలి ముగ్గురు సీఆర్ఫీఎఫ్ జవాన్లకు గాయాలు
కూంబింగ్ చేస్తుండగా తర్రెం అటవీ ప్రాంతంలో ఘటన
గాయపడ్డ జవాన్లు ఆస్పత్రికి తరలింపు
-
2024-09-29T08:51:39+05:30
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.