అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా
ABN, Publish Date - Sep 24 , 2024 | 03:44 PM
వివేకా హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ వైఎస్ సునీత రెడ్డి వేసిన పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్తోపాటు మిగిలిన నిందితులపై దాఖలైన పిటిషన్లు అన్ని కలిపి విచారించాలంటూ సునీత తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
వివేకా హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ వైఎస్ సునీత రెడ్డి వేసిన పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్తోపాటు మిగిలిన నిందితులపై దాఖలైన పిటిషన్లు అన్ని కలిపి విచారించాలంటూ సునీత తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
అందుకు జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లో కూడిన ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. దీంతో అన్ని పిటిషన్లు కలిపి నవంబర్ 5వ తేదీన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
Updated at - Sep 24 , 2024 | 03:44 PM