Home » Andhra Pradesh » Chittoor
Andhrapradesh: చంద్రబాబు ఎప్పుడు ఒంటరిగా పోటీ చెయ్యలేదని.. పొత్తులతోనే పోటీ చేశారని డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి వ్యాఖ్యలు చేశారు. సోమవారం తిరుమల శ్రీవారిని డిప్యూటీ స్పీకర్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు బలం చాలకే అన్ని పార్టీలు ఏకమై పోటీ చేస్తున్నారన్నారు. అందరూ ఏకమైన.. రానున్న ఎన్నికల్లో జగనే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లాలో 33 మంది వలంటీర్లను అధికారులు తొలగించారు. చిత్తూరు కార్పొరేషన్లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండలంలో ముగ్గురిని అధికారులు తొలగించారు. ప్రభుత్వ యంత్రాంగం అప్పగించిన పనులు సక్రమంగా చేయలేదన్న కారణంతో వలంటీర్లను తొలగించినట్లు అధికారులు చెప్పుకుంటున్నారు.
ఆర్వోల నియామకం.. సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు
తిరుమలలో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి.
మరో ఇద్దరికి గాయాలు
ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లోని రూ.కోట్ల ఖనిజ సంపద కొల్లగొడుతున్నారు
ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. శనివారం షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మోడల్ కోడ్ అమలు చేసే పనిలో పడింది. జిల్లాలో 2,130 పోలింగ్ కేంద్రాలుండగా మరో ఆరు పోలింగ్ కేంద్రాలకు అనుమతి కోసం ఈసీకి పంపారు. ఎన్నికల నిర్వహణకు సుమారు రూ.14కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదన పంపగా మొదటి విడతగా రూ.9కోట్లు మంజూరయ్యాయి.జిల్లాలో ఎన్నికల నిర్వహణకు దాదాపు 17,650మంది ఉద్యోగులను అందుబాటులో ఉంచారు.
ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో జిల్లాలో సందడి పెరిగింది. అటు పార్టీలు, ఇటు యంత్రాంగం నిజానికి ఎన్నికలకు ఒకటి రెండు నెలలుగా సమాయత్తమవుతున్నాయి.
వైసీపీ అధిష్టానం అభ్యర్థులను శనివారం ప్రకటించింది.ఇదివరకే ప్రకటించిన నియోజకవర్గాల సమన్వయకర్తలే రానున్న ఎన్నికల బరిలో అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు.వీరిలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఒక సిట్టింగ్ ఎంపీకి మళ్ళీ పోటీ చేసే ఛాన్సు లభించింది.
అప్పుడే ఎండిపోయిన హంద్రీ నీవా కాలువ ఆవిరైన రైతన్న ఆశలు అంతా ఎన్నికల స్టంటేనంటూ విమర్శలు