Home » Telangana » Hyderabad
Telangana: ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరుగగా.. కవిత తరపున న్యాయవాది నితేష్ రానా వాదనలు వినిపించగా... ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వినిపించారు. ఈడీ వాదనల అనంతరం ఈ కేసుపై విచారణను కోర్టు రేపటికి (బుధవారం) వాయిదా వేసింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. రేపు మధ్యాహ్నం ఇరువురి వాదనలు రౌస్ అవెన్యూ కోర్టు విననుంది.
దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) .. ఇప్పట్లో జైలునుంచి బయటికి వచ్చే పరిస్థితులు మాత్రం అస్సలు కనిపించట్లేదు. జైలు నుంచి బయటికి రావడానికి బెయిల్ కోసం కవిత చేస్తున్న విశ్వప్రయత్నాలన్నీ..
Telangana: నగరంలోని గౌలిగూడ మందిర్ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు యాత్ర సాగనుంది. దాదాపు 13 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. అయితే శోభాయాత్రను పురస్కరించుకుని గౌలిగూడ రామ మందిర్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజసింగ్, మాజీమంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అయోధ్యలో రాం మందిర్ ఏర్పాటు తర్వాత వచ్చిన మొదటి హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారన్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఈనెల 23వ తేదీ వరకు ట్రయల్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈరోజు కవితను అధికారులు వర్చువల్గా జడ్జి ముందు హాజరుపరచనున్నారు.
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీబీఐ అరెస్ట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగియగా.. తీర్పున రిజర్వ్ చేసింది ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు. ఆ వెంటనే ఈడీ కేసులో బెయిల్ పిటిషన్పై కోర్టులో వాదనలు మొదలవగా.. విచారణను కోర్టు రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. కవిత తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును జడ్జి కావేరి బవేజ మే 2కు రిజర్వ్ చేశారు. కాసేపటి క్రితమే లిక్కర్ స్కామ్లో సీబీఐ అరెస్ట్లో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరుగగా... కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. మహిళగా కవిత బెయిల్కు అర్హురాలన్నారు. అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదన్నారు.
Telangana: రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ కాంగ్రెస్లో చేరతారంటూ గత కొద్దిరోజులుగా వినిపించిన వార్తలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. అయితే ప్రకాష్గౌడ్ వ్యతిరేక వర్గం మాత్రతం కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. మూడు రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే కలిశారు.
మందు బాబులకు మళ్లీ షాక్. ఆరు రోజుల వ్యవధిలోనే మద్యం ప్రియులకు అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. తెలంగాణలో మంగళవారం (ఏప్రిల్ 23) నాడు నగర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17వ తేది నాడు మద్యం షాపులు, వైన్స్ మూసివేసిన విషయం తెలిసిందే. ఆరు రోజులు తిరగకముందే అంటే రేపు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శృతి చక్రవర్తి రాజస్థాన్, జైపూర్లో జరిగిన మిసెస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచి అందరినీ అలరించారు. భరత్24 సమర్పణలో గ్లామానంద్ గ్రూప్ నిర్వహించిన ఈ బ్యూటీ కాంటెస్ట్లో ప్రతిభావంతులైన మరో 20 మంది కంటెస్టెంట్స్తో పోటీపడిన శృతి చక్రవర్తి.. ఏప్రిల్ 16న జరిగిన ఫైనల్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (phone tapping case) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రాధాకిషన్ రావు ఈ కేసులో A4గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర అనుమతి ఇచ్చింది. తన తల్లికి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని రాధ కిషన్ రావు కోర్టును కోరారు.