Home » Andhra Pradesh » Kadapa
గుర్రం కొండ పట్టణానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు మంగ ళవారం టీడీపీ గూటికి చేరారు.
జిల్లా ఫ్లయింగ్ స్క్కాడ్ సిబ్బంది మంగళవారం పీలేరులోని మద్యం దుకాణాలను ఆకస్మి కంగా తనిఖీ చేసింది.
టీడీపీ, బీజేపీ, జనసేన(ఎనడీఏ)కూటమి అభ్య ర్థులను గెలిపిద్దాం, మదనపల్లెను కొత్త జిల్లా చేసుకుందామని టీడీపీ సీటీఎం క్లస్టర్ ఇనచార్జి చల్లా నరసింహులు పిలు పునిచ్చారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలో పెన్నానది పరిసర ప్రాంతాలు వైసీపీ నేతలకు కల్పతరువుగా మారిందని చెప్పవ చ్చు. ఐదేళ్లగా నియోజకవర్గంలోని అంబవరం, కన్నెలూరు, పొన్నతోట, గూడెం చెరువు, దానవులపాడు, పి.సుగుమంచిపల్లి, మైలవరం మండలంలోని దొమ్మరనంద్యాల గ్రామాల పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగింది. దీంతో ఆ పరిసర ప్రాంతాలన్నీ గుంతలై దర్శనమిస్తున్నాయి. ఏడాది కిందట టీడీపీ అధిష్టానం పిలుపుమేరకు జమ్మలమడుగులో ప్రస్తుత కడప టీడీపీ పార్లమెంటు అభ్యర్థి భూపేశ్రెడ్డి, జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్రెడ్డికి చెందిన ఇసుక టిప్పర్ ఎదుట పెన్నానదిలో నిరసన వ్యక్తం చేసి నా ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ రవాణా చేశారని బహిరంగ ఆరోపణలున్నాయి.
అన్నమయ్య జిల్లాకు సార్వత్రిక ఎన్నికల పోలీస్ పరిశీలకుడుగా నియమితులైన దిల్ నవాజ్ అహ్మద్ ఐపీఎస్ మంగళవారం అన్నమయ్య జిల్లాకు వచ్చారు. ఎస్పీ కృ ష్ణారావు పుష్పగుచ్ఛం అందించి ఆయన కు స్వాగతం పలికారు.
కడప కోర్టులో బాధితుల తరపున సివిల్ కేసు దాఖలు చేసి, వారికి అండగా నిలిచినందుకు ప్రతివాదులు న్యాయవాది పీ. శివసుధాకర్పై దాడి చేసినందుకు నిరసనగా మంగళవారం రాయచోటి కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు.
మండలంలోని బొమ్మవరం గ్రామ పంచా యతీలో ఉమ్మడి అభ్యర్ధి అరవ శ్రీధర్, ఎంపీ అభ్యర్ధి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి గెలుపుకోసం టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ప్రచారం చేశారు.
ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి పేదల సంక్షేమాన్ని విస్మరించారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్బాబు తెలిపారు. మంగళవారం మండలంలోని తిమ్మసముద్రం గ్రామ పంచాయతీలో కూటమి ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభిం చారు.
మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య (Vivekananda Reddy Case), పెండింగ్ కేసులపై ఎవరూ మాట్లాడవద్దని కడప కోర్ట్ ఇచ్చిన తీర్పుపై ఏపీ హైకోర్టు (AP High Court)లో తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి అప్పీల్ వేశారు. ఇదే అంశంపై మంగళవారం ఏపీ హైకోర్టును వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆశ్రయించిన విషయం తెలిసిందే.
జనసేన గెలుపు రైల్వేకోడూరు అభివృద్ధికి ములుపు అని రైల్వేకోడూరు టీడీపీ ఇనచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి వరలక్ష్మి తెలిపారు.