Home » Telangana » Karimnagar
కాంగ్రెస్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి ఎవరన్న చిక్కుముడి వీడడం లేదు. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తొమ్మిది సార్లు సమావేశమై అభ్యర్థులను ఖరారు చేసినా కరీంనగర్ అభ్యర్థి విషయం తేలడం లేదు.
హలో సర్...మీ అమ్మాయి పదో తరగతిలో మంచి మార్కులు సాధిస్తుందని తెలుసుకున్నాము...మీ అమ్మా యి బాగా చదువుతుందని ముందు నుంచే విన్నాం.. మా కళాశాలలో నాణ్యమైన బోధన ఉంటుంది. మంచి మార్కులు వచ్చే విద్యార్థులకు ఫీజు లో రాయితీ ఇస్తాం...ఒకసారి మా కాలేజీకి వచ్చి చూడండి...కేవలం ముం దస్తు అడ్మిషన్ ఫీజు చెల్లిస్తే చాలు...అంటూ ప్రైవేటు, కార్పొరేటు కళాశా లల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్కాల్స్ చేస్తూ అడ్మిష న్ల వల విసురుతున్నారు.
పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చాలంటూ మొదలైన దుమారం సద్దుమణగడం లేదు. పార్టీకి చెందిన మాదిగ సామాజికవర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, సంఘాల నేతలు ఆందోళనలు చేస్తున్నారు.
వస్త్ర పరిశ్రమలో సంక్షోభంతో మునుపటి పరిస్థితులు ఆవిష్కృతమవుతున్నాయి. నేతన్నలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఉపాధి కోసం రోడ్డెక్కి ఆందోళ నలు చేస్తున్నారు. పోగుపోగు అతుకుతూ చిక్కు పడిన ఎదురుపోగులను వేరు చేస్తూ మరమగ్గాల చప్పుళ్ల మధ్య నేతన్నలు జీవనం సాగించారు. గత ప్రభుత్వ ఆర్డర్లతో ఉపాధి పొందారు. కొత్త ప్రభుత్వంలో ప్రభుత్వ ఆర్డర్లు దూరమవడం, ప్రైవేటు మార్కెట్ కోల్పోయి ఆర్డర్లు లేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.
బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే లా ఓటు ప్రాముఖ్యత వివరిస్తూ స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ పేర్కొన్నారు.
బహుజనులు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాజ్యా ధికారం చేపట్టాలని బీఎస్పీ పార్లమెంట్ ఇన్చార్జి కాదాసు రవీందర్ పిలుపుని చ్చారు.
తాగునీటి సమస్య లేకుం డా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్ అధికా రులకు సూచించారు.
భ్రూణ హత్యలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ అరుణశ్రీ అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో శివ కల్యాణ మహోత్సవాలు బుధవారం ప్రాంభమయ్యాయి.
నేతన్నల బతుకులతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకోవద్దని సీఐటీయూ పవర్లూం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ డిమాండ్ చేశారు.