కాల్వలో పడిపోయిన మూర్చవ్యాధిగ్రస్తుడు

ABN , First Publish Date - 2021-10-25T04:58:24+05:30 IST

మహానంది ఆలయంలోని కోనేర్ల నుంచి పంట పొలాలకు వెళ్లే నీటి కాల్వలో పడి కొట్టుకొని వచ్చిన మూర్చవ్యాధిగ్రస్తుడిని స్థానికులు గుర్తించి కాపాడారు.

కాల్వలో పడిపోయిన మూర్చవ్యాధిగ్రస్తుడు
కాల్వలో కొట్టుకొని వచ్చిన వ్యక్తిని కాపాడుతున్న స్థానికులు

మహానంది, అక్టోబరు 24: మహానంది ఆలయంలోని కోనేర్ల నుంచి పంట పొలాలకు వెళ్లే నీటి కాల్వలో పడి కొట్టుకొని వచ్చిన మూర్చవ్యాధిగ్రస్తుడిని స్థానికులు గుర్తించి కాపాడారు. మండల పరిధిలోని తమ్మడపల్లికి చెందిన బాషా అనే వ్యక్తి ఇటీవలనే మహానందిలోని ఒక హోటల్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆదివారం మూర్చవ్యాధితో తాను పని చేసే హోటల్‌ సమీపంలోని కాల్వలో పడ్డాడు. అయితే ఆ సమయంలో ఎవరూ గుర్తించలేదు. కొంతదూరం కాల్వలో కొట్టుకొని పోగా స్థానికులు గుర్తించి గట్టుకు చేర్చారు. అనంతరం స్థానిక వైద్యుడి వద్దకు చికిత్స కోసం తరలించారు. బాషా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు గుర్తించడంతో బాషా ప్రాణాల నుంచి బయటపడ్డాడు.

 

Updated Date - 2021-10-25T04:58:24+05:30 IST