Viakarabad: డ్రోన్ల సాయంతో ఔషదాల పంపిణీ ప్రారంభం
ABN , First Publish Date - 2021-09-11T18:49:10+05:30 IST
జిల్లాలో డ్రోన్ల సాయంతో ఔషదాల పంపిణీ ప్రారంభమైంది.
వికారాబాద్: జిల్లాలో డ్రోన్ల సాయంతో ఔషదాల పంపిణీ ప్రారంభమైంది. అటవీ ప్రాంతాలకు డ్రోన్ల సాయంతో మందుల సరఫరా కోసం మెడిసిన్ ఫ్రమ్ స్కై ప్రాజెక్ట్ను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబిత, అధికారులు పాల్గొన్నారు. సమారు 40 కిలోమీటర్ల వరకు డ్రోన్లు ప్రయాణించనున్నాయి. ఒక్కో డ్రోన్లో 15 రకాల ఔషధాలు, టీకాల సరఫరాకు అవకాశం ఉంది. భూమికి 500-700 మీటర్ల ఎత్తులో డ్రోన్ ప్రయాణించనుంది.