టీఆర్ఎస్ అభివృద్ధికి అడ్డుపడుతోంది: ఎంపీ అర్వింద్

ABN , First Publish Date - 2022-01-25T18:11:14+05:30 IST

టీఆర్ఎస్ అభివృద్ధికి అడ్డుపడుతోంది: ఎంపీ అర్వింద్

టీఆర్ఎస్ అభివృద్ధికి అడ్డుపడుతోంది: ఎంపీ అర్వింద్

నిజామాబాద్: ఆర్మూర్‌లోని మామిడిపల్లి చౌరస్తాలో ధర్నాలో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. నందిపేట్‌లో అర్వింద్ పర్యటనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణుల యత్నించారు. సీపీ నాగరాజుకు ఫోన్‌లో పరిస్థితిని వివరించినట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీస్ వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ అడ్డుపడుతున్నది తనకు కాదు.. అభివృద్ధికి అని ఎంపీ అర్వింద్ విమర్శించారు. కోవిడ్ రూల్స్ బీజేపీ కార్యకర్తలకు మాత్రమే వర్తిస్తాయా? అని అర్వింద్ ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలను అడ్డుకుంటున్న పోలీసులు,.. అధికార పార్టీ వారిని ఎందుకు అడ్డుకోరు? అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. టీఆర్ఎస్ నేతల దౌర్జన్యాలు పోలీసులకు కనిపించడం లేదా? అని అర్వింద్ ప్రశ్నించారు.

Updated Date - 2022-01-25T18:11:14+05:30 IST