హత్య కేసులో వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2021-10-23T06:03:05+05:30 IST

murder case a man arrested

హత్య కేసులో వ్యక్తి అరెస్టు

యానాం, అక్టోబరు 22: హత్యకేసుకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కోనా సుబ్బారావు (చంటి) వద్ద యానానికి చెందిన తనికి శ్రీను అలియాస్‌ గోవిందు(45) పనిచేస్తున్నాడు. ఈనేపథ్యంలో గమేళా తీసుకువెళ్లిన విషయంలో నెల రోజులు కితం గోవిందును చంటి కొట్టాడు. అదేరోజు సాయంత్రం మరోసారి గోవిందును కొట్టాడు. అనంతరం ఇంటికి వెళ్లిన గోవిందుకు వాంతులు కావడంతో యానాం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. స్కానింగ్‌ చేసి తలకు బలమైన గాయమై రక్తం గడ్డ కట్టినట్టు గుర్తించారు. దీంతో కాకినాడ ప్రభుత్వా సుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గోవిందు అక్కడ మృతి చెందాడు. నెల రోజులుగా పరారీలో ఉన్న చంటిని శుక్రవారం యానాం అగ్నికులక్షత్రియ కల్యాణ మండపం వెనుక సంచరిస్తుండుగా అరెస్టు చేసినట్టు సీఐ అరివిసేల్వం తెలిపారు. కోర్టులో హాజరపరచనున్నట్టు చెప్పారు. 



Updated Date - 2021-10-23T06:03:05+05:30 IST