పోడు.. గోడు తీరేనా?
ABN , First Publish Date - 2021-10-24T06:53:29+05:30 IST
పోడు వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా సాగు చేసుకుంటున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. ప్రతి ఏడు సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి పంట చే తికి వచ్చే వరకు అటవీ శాఖాధికారుల నుంచి ఆంక్షలే ఎ దురవుతున్నాయి.తాజాగా పోడు భూములకు పరిష్కారం చూపుతామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో గిరిజన రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇందులో భాగంగానే శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఐటీడీఏ పీవో భవేశ్మిశ్రా, అటవీ శాఖ కన్జర్వేటర్ అధికారి రామలింగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోడు భూముల వివరాలను ప్రభుత్వానికి అందజేశారు.
జిల్లాలో పోడు సాగుపై కొనసాగుతున్న ఆంక్షలు
పోడు భూములపై కదలిన అఽదికార యంత్రాంగం
2006 అటవీ హక్కు చట్టాన్ని అమలు చేయాలంటున్న గిరిజనులు
రెవెన్యూ, అటవీ శాఖ మధ్య కొరవడిన సమన్వయం
ఆదిలాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పోడు వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా సాగు చేసుకుంటున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. ప్రతి ఏడు సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి పంట చే తికి వచ్చే వరకు అటవీ శాఖాధికారుల నుంచి ఆంక్షలే ఎ దురవుతున్నాయి.తాజాగా పోడు భూములకు పరిష్కారం చూపుతామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో గిరిజన రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇందులో భాగంగానే శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఐటీడీఏ పీవో భవేశ్మిశ్రా, అటవీ శాఖ కన్జర్వేటర్ అధికారి రామలింగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోడు భూముల వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. అయితే ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనేతర రైతులు కూడా పోడు భూములను సాగు చేసుకోవడంతో ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారుతుంది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబరు 31 లోపు అటవీ భూములను సాగు చేసుకున్న వారి కి హక్కు పత్రాలు అందించాలని కేంద్ర అటవీ హక్కుల చట్టం పేర్కొం టుంది. జిల్లాలో ఒక లక్ష ఎకరాల వరకు పోడు భూములు ఉన్నట్లు అ టవీ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. అనాధికారికంగా మాత్రం పోడు భూముల విస్తీర్ణం మరింత అధికంగానే ఉం టుందని గిరిజన సంఘాల నేతలు చెబుతున్నారు. గతంలో ఉ మ్మడి జిల్లావ్యాప్తంగా 56,358 మంది పోడు రైతులు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకోగా, ఇందులో గ్రామ సభల ద్వారా 37,372 దరఖాస్తులకు ఆమోదం లభించింది. సుమారు మరో 25వేల మంది వరకు అర్హులైన రైతులు ఉన్నట్లు అంచ నా వేస్తున్నారు. కొన్నేళ్లుగా పోడు భూముల హక్కు పత్రాల కో సం ఆందోళనలు చేపడుతున్న ప్రభుత్వాలు సమస్యకు పరిష్కారం చూపడం లేదంటూ గిరిజన రైతులు వాపోతున్నారు.
హామీలు అమలయ్యేనా?
2014, 2018 ఎన్నికల్లో జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ప్రధానంగా పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతామంటూ హామీలిచ్చి ఏడేళ్లు గడుస్తున్నా పరిష్కారం కాకపోవడంతో గిరిజన రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ఏజెన్సీలో గిరిజనేతర రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామంటూ ఎన్నోసార్లు చెప్పిన హామీలు అమలుకు నోచుకోవడం లేదు. 2018 ఎన్నికల సమయంలో మూ డు రోజుల పాటు జిల్లాలోనే కూ ర్చి వేసుకొని పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతానని ఏకంగా ముఖ్యమంత్రే చెప్పినా అడుగు ముందుకు పడినట్లు కనిపించడం లేదు. హామీలు ఎలా ఉన్న కుటుంబాన్ని పోషించుకునేందుకు గిరిజన రైతులు ఏటా పో డు భూములను సాగు చేసుకుంటున్న అటవీ శాఖాధికారుల బెదిరింపులు ఆగడం లేదు. చేతికి వచ్చిన పంటను అధికారులు కళ్ల ముందే ధ్వంసం చేయడంతో బతుకుపై భరోసా లేక ఉసురు తీసుకుంటున్నారు.
తెరపైకి 2018 కటాఫ్ డెట్..
పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2018 కటాఫ్ డెట్ను తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోం ది. ఇప్పటికే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 2018ని కటాఫ్డెట్గా పేర్కొంటూ కేంద్రానికి నివేదిక ఇచ్చిన ఫలితం కనిపించడం లే దు. ప్రభుత్వం అడుగులు వేసేందుకు సిద్ధమైనట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలోనూ చేపట్టిన భూసమగ్ర సర్వే ద్వారా పో డు భూములకు పరిష్కారం దక్కలేదు. ఇప్పటికీ పోడు రైతులు అవే క ష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా అటవీ, రెవెన్యూ శాఖ మధ్య సమన్వయం లేకపోవడంతో భూహద్దులపై వివాదమే కొనసాగుతుంది. గతంలో కొందరికి హక్కు పత్రాలు ఇచ్చి ఎలాంటి కారణం చెప్పకుండానే వేల దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో పోడు రైతుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభు త్వం ఏం పరిష్కారం చూపుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఏనా డైనా భూమిపై హక్కులు రాకపోతాయన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు శాశ్వత పరిష్కా రం చూపుతుందా..? లేక కేంద్ర ప్రభుత్వంపై నెట్టెసి చేతులు దులుపుకుంటుందా..? అనే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.
అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి
గోడం గణేష్ (తుడందెబ్బ జిల్లా అధ్యక్షుడు)
ప్రభుత్వాలు చిత్తశుద్ధితో 2006 అటవీ హక్కుల చట్టాన్ని అ మలు చేయాలి. ఏ మాత్రం కటాఫ్డేట్ను పెంచిన గిరిజన రైతులకు అన్యాయమే జరుగుతుంది. న్యాయపరమైన చిక్కులతో సమస్య పరిష్కారం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అప్పట్లో తిరస్కరించిన దరఖాస్తుదారులకైనా హక్కుపత్రాలు ఇస్తే కొంతమంది రైతులకు మేలు జరుగుతుంది. చట్టం పేరిట అధికారులు పోడు రైతులను వేదిస్తే సహించేది లేదు. గత ఎన్నికల్లో కేసీఆర్ పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని స్పష్టంగా హామీ ఇచ్చిన పరిష్కారమే కనిపించడం లేదు.