కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించండి

ABN , First Publish Date - 2022-01-21T06:48:45+05:30 IST

కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) చంద్రశేఖర్‌ సింగరేణి వైద్యులకు సూ చించారు.

కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించండి
ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడుతున్న డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) చంద్రశేఖర్‌

- ఏరియా ఆసుపత్రిని సందర్శించిన డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌)

గోదావరిఖని, జనవరి 20: కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) చంద్రశేఖర్‌ సింగరేణి వైద్యులకు సూ చించారు. గురువారం స్థానిక ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవల ను ఆసుపత్రి డీవైసీఎంఓ కిరణ్‌రాజ్‌ను అడిగి తెలుసుకున్నారు. కరోనా రోగులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా చూడాలని, వార్డులను, ఐసోలేషన్‌లను ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేయాలని, గదుల్లో బెడ్‌లను ఏర్పాటు చేయాలని, ఎక్కువ మొత్తంలో పరీక్షలు నిర్వ హించాలని, వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పిం చాలని, రోగులకు వైద్యం అందించడంలో నిర్ల క్ష్యం వహించవద్దని ఆయన వైద్యులకు సూ చించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఆయన సందర్శించారు. డైరెక్టర్‌ వెంట ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ, డీవైసీఎంఓ కిరణ్‌రాజ్‌, సెక్యూరిటీ ఆఫీసర్‌ వీరారెడ్డి, సంక్షేమాధికారి కందకట్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T06:48:45+05:30 IST