అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి పేలిన తూటా.. ఒకరు మృతి!

ABN , First Publish Date - 2021-03-21T21:01:30+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ వ్యక్తి జరిపిన దాడిలో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. డల్లాస్‌లోని ప్రైమ్ నైట్ క్లబ్‌లో రెండు వర్గాల

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి పేలిన తూటా.. ఒకరు మృతి!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ వ్యక్తి జరిపిన దాడిలో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. డల్లాస్‌లోని ప్రైమ్ నైట్ క్లబ్‌లో రెండు వర్గాల మధ్య శనివారం రోజు ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తి తుపాకీ తీసి, మరో వర్గంపై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు. వారందరినీ ఆసుపత్రి తరలించగా తీవ్రంగా గాయపడిన మహిళ.. ప్రాణాలు కోల్పోయినట్టు డాక్టర్లు పేర్కొన్నారు. మిగిలిన ఐదుగురిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే..  అట్లాంటా రాష్ట్రంలోని మసాజ్ కేంద్రంలో మంగళవారం సాయంత్రం రాబర్ట్ ఆరోన్ లాంగ్ (21) అనే యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.


Updated Date - 2021-03-21T21:01:30+05:30 IST