ప్రకాశంలో గ్రామ వాలంటీర్ల అరాచకం.. 10 మంది రాజీనామా
ABN , First Publish Date - 2020-04-02T19:04:04+05:30 IST
ప్రకాశం జిల్లాలోని తర్లుబాడు మండలం సీతా నాగులవరంలో గ్రామ వాలంటీర్లు అరాచకానికి
ఒంగోలు : ప్రకాశం జిల్లాలోని తర్లుబాడు మండలం సీతా నాగులవరంలో గ్రామ వాలంటీర్లు అరాచకానికి పాల్పడ్డారు. గత రెండు నెలలుగా తెలుగుదేశం పార్టీకి చెందిన 13 మంది పెన్షన్ దారులకు నగదు ఇవ్వకుండా ప్రభుత్వానికి జమ చేస్తున్న వైనం వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు నిన్న అనగా బుధవారం నాడు ఉన్నతాధికారులు పెన్షన్ నగదు పంపిణీ చేశారు. తమ అనుమతి లేకుండా టీడీపీ సానుభూతి పరులకు పెన్షన్ ఎలా ఇస్తారంటూ తీవ్ర ఆగ్రహానికి లోనైన 10 మంది గ్రామ వాలెంటర్లు రాజీనామా చేశారు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.