రేషన్‌కార్డులు ఉన్న వారికి ఉచితంగా 10 కేజీల రేషన్: మంత్రి గంగుల

ABN , First Publish Date - 2020-07-05T01:29:51+05:30 IST

రేషన్‌కార్డులు ఉన్న వారికి ఉచితంగా 10 కేజీల రేషన్: మంత్రి గంగుల

రేషన్‌కార్డులు ఉన్న వారికి ఉచితంగా 10 కేజీల రేషన్: మంత్రి గంగుల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. కరోనా నేపథ్యంలో ఉపాధి లేక కష్టాల్లో పేద ప్రజలకు జూలై నెల రేషన్ బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణలో ఆదివారం నుంచి పేదలకు ఉచితంగా 10 కేజీల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కేంద్రం ఆహార భద్రతాకార్డు లబ్ధిదారులకు 5 కేజీలు మాత్రమే ఉచితంగా ఇస్తోందని, రాష్ట్రంలో రేషన్‌కార్డులు ఉన్న అందరికీ ఉచితంగా 10 కేజీల రేషన్ బియ్యం ఇస్తామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.

Updated Date - 2020-07-05T01:29:51+05:30 IST