గుజరాత్లో చిక్కుకున్న జాలర్ల కోసం 10లక్షలు
ABN , First Publish Date - 2020-04-08T09:09:45+05:30 IST
లాక్డౌన్ కారణంగా గుజరాత్లోని వేరావల్ పోర్టులో చిక్కుకున్న 5వేల మంది ఏపీ వలస కార్మికులు, మత్స్యకారుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం అధికార బృందాన్ని పంపింది.
అమరావతి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ కారణంగా గుజరాత్లోని వేరావల్ పోర్టులో చిక్కుకున్న 5వేల మంది ఏపీ వలస కార్మికులు, మత్స్యకారుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం అధికార బృందాన్ని పంపింది. ఆ బృందం వేరావల్ చేరుకుని వారి యోగక్షేమాలు తెలుసుకుని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. వారి తక్షణ సౌకర్యాల కోసం ప్రభుత్వం రూ.10లక్షలు మంజూరు చేసింది.