ఒక్కరోజే పది మంది మృతి
ABN , First Publish Date - 2021-05-15T06:28:44+05:30 IST
కరోనా వైరస్కు శుక్ర వారం జిల్లాలో పది మంది మృతి చెందారు.
1,436 మందికి పాజిటివ్
12 వేల 413 కేసులు యాక్టివ్
ఏలూరు ఎడ్యుకేషన్, మే 14 : కరోనా వైరస్కు శుక్ర వారం జిల్లాలో పది మంది మృతి చెందారు. కొవిడ్ సెకం డ్ వేవ్లో ఒకేరోజు అధిక సంఖ్యలో బాధితులు మృతి చెందడం ఇది రెండోసారి. ఇప్పటి వరకు జిల్లాలో మృతి చెందిన వారి సంఖ్య 669కి చేరింది. మరోవైపు ఆసు పత్రులు, హోం ఐసొలేషన్లలో చికిత్స పొందుతున్న బాధి తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం కలవరం పుట్టిస్తోంది. శుక్రవారం సాయంత్రం వరకు జిల్లాలో కొత్త గా 1436 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. యాక్టివ్ కేసులు 12 వేల 413కి పెరిగాయి. కొత్తగా మరో 44 చోట్ల కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు కానున్నాయి.