10 ఎర్రచందనం దుంగలు, కారు పట్టివేత
ABN , First Publish Date - 2021-10-24T05:07:12+05:30 IST
మండలంలోని పెద్దపాడు-తురకపల్లి బ్రిడ్జి వద్ద శుక్రవారం రాత్రి రైల్వేకోడూరు రేంజి అటవీ శాఖాధికారులు దాడులు నిర్వహించి 10 ఎర్రచందనం దుంగలు, కారు స్వాధీనం చేసుకున్నారు.
రైల్వేకోడూరు, అక్టోబరు 23: మండలంలోని పెద్దపాడు-తురకపల్లి బ్రిడ్జి వద్ద శుక్రవారం రాత్రి రైల్వేకోడూరు రేంజి అటవీ శాఖాధికారులు దాడులు నిర్వహించి 10 ఎర్రచందనం దుంగలు, కారు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రైల్వేకోడూరు సబ్ డీఎ్ఫవో ధర్మరాజు, రేంజర్ నయీమ్ఆలీ మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం మేరకు ఎర్రచందనం అక్రమ రవాణాపై దాడుల్లో భాగంగా అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న దుంగలు, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్మగ్లర్లు పరారయ్యారన్నారు. దాడుల్లో బాలపల్లి సెక్షన్ డిప్యూటీ రేంజర్ ఎం.మహే్షకుమార్, ఎఫ్బీవోలు జనార్ధన్, జగజ్జీవన్రావు, స్ర్టైకింగ్ఫోర్సు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.