10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ABN , First Publish Date - 2021-07-30T04:50:36+05:30 IST
శేషాచలం అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుం గలను రవాణా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 10 దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయి రేంజ ర్ పీరయ్య తెలిపారు.
సుండుపల్లె, జూలై 29: శేషాచలం అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుం గలను రవాణా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 10 దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయి రేంజ ర్ పీరయ్య తెలిపారు. గు రువారం రాజంపేట డీ ఎఫ్వో శ్రీనివాసులు సమాచారం మేరకు... పింఛా సెక్షన్ దిన్నెలబీట్ మేకమానిబండ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని విచారించగా తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా తిరువణ్ణామలైకి చెందిన చిన్నల్, తీర్థగిరిగా తెలిపారన్నారు. వారు రవాణా చేస్తున్న 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. దాడుల్లో ఎఫ్ఎ్సవో ఎంవీ రమణ, ఎఫ్బీవో సునీల్బాషా, పింఛా బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.