కేసీఆర్‌కు చేతకాదంటే నెల రోజుల్లో 100 కోట్లు

ABN , First Publish Date - 2021-02-23T08:43:49+05:30 IST

రాష్ట్రంలో అసెం బ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ అధికారంలోకి వస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.

కేసీఆర్‌కు చేతకాదంటే నెల రోజుల్లో 100 కోట్లు

భద్రాద్రి పర్యటనలో ఎమ్మెల్యే రఘునందన్‌

కొత్తగూడెం/భద్రాచలం, ఫిబ్రవరి 22: రాష్ట్రంలో అసెం బ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ అధికారంలోకి వస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.  తన దృష్టిలో కేసీఆర్‌ సన్నాసి అని వ్యాఖ్యానించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి టీఆర్‌ఎ్‌సలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ సరైన ప్రాధాన్యం కల్పించడం లేదన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదివాసీల భూములకు పట్టాలిస్తామంటేనే వారు టీఆర్‌ఎ్‌సలో చేరారని గుర్తుచేశారు. అనంతరం రఘునందన్‌రావు భద్రాచలం వెళ్లి రామయ్యను దర్శించుకున్నారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా ఆహామీ నెరవేర్చలేదన్నారు. కేసీఆర్‌కు చేతకాదని ఒప్పుకుంటే నెల రోజుల్లో ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేంద్రం నుంచి తెస్తామని చెప్పారు. 

Updated Date - 2021-02-23T08:43:49+05:30 IST