వెయ్యేళ్ల నాటి దిగుడు బావి!
ABN , First Publish Date - 2020-09-10T05:30:00+05:30 IST
ఈ బావిని వెయ్యేళ్ల క్రితం నిర్మించారు. బావిలోకి దిగడానికి నిర్మించిన మెట్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. రాజస్థాన్లోని అభనేరి గ్రామంలో ఉన్న బావి విశేషాలు ఇవి...
ఈ బావిని వెయ్యేళ్ల క్రితం నిర్మించారు. బావిలోకి దిగడానికి నిర్మించిన మెట్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. రాజస్థాన్లోని అభనేరి గ్రామంలో ఉన్న బావి విశేషాలు ఇవి.
- 8వ శతాబ్దంలో నికుంభ రాజ వంశీయుల పాలనలో ఈ బావి నిర్మాణం జరిగింది. ఈ బావి లోతు ఎంతో తెలుసా? 13 అంతస్థుల భవనాన్ని ఈ బావిలో పెడితే మునిగిపోతుంది. ఈ బావిలోకి దిగడానికి 3500 మెట్లు నిర్మించారు.
- ఈ బావిలోకి దిగడానికి మూడువైపులా మెట్లు నిర్మించారు. నాలుగో వైపు అందమైన మంటపాలు ఉన్నాయి. బావి సమీపంలోని రాజ నివాసం, ప్రదర్శనల కోసం ఏర్పాటు చేసిన వేదిక ఇప్పటికీ ఉన్నాయి.
- బావి సమీపంలోనే హర్షత్ మాత ఆలయం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు బావిలోని నీటితో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకున్నాకే ఆలయంలోకి వెళ్లే వారు. 10వ శతాబ్దంలో మహమ్మద్ గజినీ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఇప్పటికీ శిథిల ఆలయ ఆనవాళ్లు కనిపిస్తాయి.
- ప్రజలకు నీటి సరఫరా కోసం ఈ బావిని తవ్వించారు. తరువాత కాలంలో ఈ బావి నిరుపయోగంగా మారింది. అయితే ఈ బావిని చూడటం కోసం పర్యాటకులు వస్తుంటారు.