భారత్‌లో కరోనా మరణాల కలకలం.. గడచిన 24 గంటల్లో..

ABN , First Publish Date - 2020-08-14T16:52:00+05:30 IST

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా...

భారత్‌లో కరోనా మరణాల కలకలం.. గడచిన 24 గంటల్లో..

భారత్‌లో గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు, 1007 కరోనా మరణాలు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 64,553 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులతో కలిపి భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24,61,191కి చేరింది. భారత్‌ను కరోనా మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. భారత్‌లో గడచిన 24 గంటల్లో 1007 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో.. భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 48,040కి చేరింది. భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6,61,595. భారత్‌లో ఇప్పటివరకూ 17,51,556 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Updated Date - 2020-08-14T16:52:00+05:30 IST