వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరుకున్న 10.5లక్షల మంది భారతీయులు!

ABN , First Publish Date - 2020-08-15T21:11:35+05:30 IST

కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ‘వందే భారత్

వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరుకున్న 10.5లక్షల మంది భారతీయులు!

న్యూఢిల్లీ: కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ‘వందే భారత్ మిషన్’లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 10.5లక్షల మంది భారతీయులు ఇండియాకు చేరుకున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ప్రకటించారు. ఆగస్ట్ 11 నాటికే సుమారు 10లక్షల మంది భారతీయులు స్వదేశానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆగస్ట్‌ చివరి నాటికి దాదాపు 500 అంతర్జాతీయ విమానాలు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ను మే 7న ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా.. ఆగస్ట్ 1 నుంచి ఐదో విడత ‘వందే భారత్ మిషన్’ కొనసాగుతోంది.  


Updated Date - 2020-08-15T21:11:35+05:30 IST