రాష్ట్రంలోని 134 కరోనా కేసుల్లో 106 తబ్లీగీ జమాత్కు సంబంధించవే: సీఎం
ABN , First Publish Date - 2020-04-10T01:48:29+05:30 IST
రాష్ట్రంలో మొత్తంగా 134 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారని హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు. అయితే వీరిలో 106 మంది...
చండీఘర్: రాష్ట్రంలో మొత్తంగా 134 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారని హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు. అయితే వీరిలో 106 మంది ఢిల్లీలోని నిజాముద్దీన్లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంతో సంబంధం ఉన్నవారేనని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో దాదాపు 80 శాతం మంది తబ్లీగీ జమాత్కు నేరుగా హాజరైనవారు లేదా హాజరైనవారికి సన్నిహితంగా ఉన్నవారేనని అధికారులు వెల్లడించారు.