108 సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

ABN , First Publish Date - 2020-08-05T19:39:59+05:30 IST

శ్రీకాకుళం: 108 సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి అయింది. ఇచ్చాపురం మండలం ముచ్చిందర గ్రామానికి చెందిన సాడి తులసమ్మను పాము కాటు వేసింది.

108 సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

శ్రీకాకుళం: 108 సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి అయింది. ఇచ్చాపురం మండలం ముచ్చిందర గ్రామానికి చెందిన సాడి తులసమ్మను పాము కాటు వేసింది. శ్రీకాకుళం తరలించాలని వైద్యులు సూచించారు. అయితే కాల్ చేసిన రెండు గంటల తరువాత 108 వాహనం వచ్చింది. తులశమ్మను వాహనంలో ఎక్కించి శ్రీకాకుళం తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే కన్నుమూసింది. సకాలంలో అంబులెన్స్ రాకపోవటంతోనే తులశమ్మ చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. కోవిడ్ డ్యూటీ కారణంగా ఆలస్యం అయ్యిందని 108 సిబ్బంది తెలిపింది.


Updated Date - 2020-08-05T19:39:59+05:30 IST