HYD : ఇంటి నుంచి బయటికెళ్లిన విద్యార్థిని మిస్సింగ్..

ABN , First Publish Date - 2021-10-26T12:00:31+05:30 IST

ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌

HYD : ఇంటి నుంచి బయటికెళ్లిన విద్యార్థిని మిస్సింగ్..

హైదరాబాద్ సిటీ/మల్కాజిగిరి : ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. తాళ్లబస్తీకి చెందిన నల్గొండ స్వాతి (20) పదో తరగతి పూర్తి చేసింది. సోమవారం ఇంటినుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఆచూకీ కోసం చుట్టుపక్కల ఆరా తీసినా ప్రయోజనం లేకపోవడంతో స్వాతి సోదరుడు అరుణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-26T12:00:31+05:30 IST