మేడ మీద గదిలో ఉన్న 16 ఏళ్ల తమ్ముడు.. అన్నానికి పిలిచేందుకు వెళ్లిన సోదరి.. కిటికీలోంచి ఆమె చూస్తే గదిలో షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2021-11-02T00:55:08+05:30 IST

ఆ కుర్రాడి వయసు ఇప్పుడు 16ఏళ్లే. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. పబ్లిక్ ఎగ్జామ్ రాయాల్సి ఉన్నందున అతడి చదువుకు ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో.. కుటుంబ సభ్యులు ఆ కుర్రాడి కోసం మేడ మీద ప్రత్యే

మేడ మీద గదిలో ఉన్న 16 ఏళ్ల తమ్ముడు.. అన్నానికి పిలిచేందుకు వెళ్లిన సోదరి.. కిటికీలోంచి ఆమె చూస్తే గదిలో షాకింగ్ సీన్..!

ఇంటర్నెట్ డెస్క్: ఆ కుర్రాడి వయసు ఇప్పుడు 16ఏళ్లే. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. పబ్లిక్ ఎగ్జామ్ రాయాల్సి ఉన్నందున అతడి చదువుకు ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో.. కుటుంబ సభ్యులు ఆ కుర్రాడి కోసం మేడ మీద ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేశారు. డిస్ట్రబ్ అవుతుందన్న ఉద్దేశంతో గదిలో ఉన్న కుర్రాడిని ఎవ్వరూ పలకరించేవారు కాదు. అయితే.. ఆ కుర్రాడు మాత్రం చక్కగా చదువుకోకుండా.. గదిలో ఒంటరిగా మరోపని చేశేవాడు. తాజాగా రాత్రి సమయంలో భోజనం చేయడానికి పిలిచేందుకు అతడి సోదరి ఆ కుర్రాడి తలుపు తట్టింది. ఎంతసేపటికీ లోపలి నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో సందేహం వచ్చి.. కిటికీలోంచి గదిలోకి చూసింది. అనంతరం అక్కడ కనిపించిన సీన్ చూసి షాకైంది. గట్టిగా కేకలు వేసింది. కాగా.. గదిలో ఆమె ఎటువంటి సీన్ చూసింది, ఆ తర్వాత ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



రాజస్థాన్‌లోని జోధ‌పూర్‌కు చెందిన సౌరభ్‌ (16) తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. తమ కుమారుడు ఈ ఏడాది పబ్లిక్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉన్నందున అతడి తల్లిదండ్రులు సౌరబ్ కోసం మేడపైన ఓ గదిని ఏర్పాటు చేశారు. చదువుకుంటాడనే ఉద్దేశంతో ఎవ్వరూ అతడిని డిస్ట్రబ్ చేసేవారు కాదు. కేవలం తినడానికి మాత్రమే కిందకు పిలిచేవారు. అయితే.. తల్లిదండ్రులు కల్పించిన ఆ సౌకర్యాన్ని సౌరభ్ మిస్ యూస్ చేసుకున్నాడు. సాధారణంగా ప్రస్తుతం ఉన్న అందరు పిల్లల్లాగానే మొబైల్ ఫోన్‌కు బానిసయ్యాడు. ఫోన్‌లో గంటల తరబడి కార్ రేసింగ్ గేమ్ ఆడటం ప్రారంభించాడు. కాగా.. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి తన సౌరభ్‌ను భోజనానికి పిలిచేందుకు అతడి సోదరి మేడపైకి వెళ్లింది. అతడి డోర్ తట్టి, భోజనానికి రావాల్సిందిగా సూచించింది. అయితే లోపల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో.. కిటికిలోంచి గదిలోకి చూసింది.


అంతే అక్కడ కనిపించిన దృశ్యం చూసి, ఆమె షాకైంది. ఉరి వేసుకుని సోదరుడు విగత జీవిగా వేలడుతుండటంతో కేకలు పెట్టింది. దీంతో తల్లిదండ్రులు, స్థానికులు అక్కడకు చేరుకున్నారు. ఆ తర్వాత గది తలపులు పగలగొట్టి, శవాన్ని కిందకు దించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడారు. సౌరభ్ గదిలో ఎటువంటి సూసైడ్ నోట్‌ దొరకలేదని.. బహుశా గేమ్‌లో ఓటమిపాలైనందున ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే అన్ని విషయాలు విచారణలో బయటపడతాయని అభిప్రాయపడ్డారు. 




Updated Date - 2021-11-02T00:55:08+05:30 IST