కరోనా వేళ బర్త్డే పార్టీ.. 11మంది డాక్టర్లపై కేసు!
ABN , First Publish Date - 2020-07-20T04:25:28+05:30 IST
దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఇటువంటి సమయంలో కొంతమంది వైద్యులు బర్త్డే పార్టీ చేసుకున్నారు.
పూణే: దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఇటువంటి సమయంలో కొంతమంది వైద్యులు బర్త్డే పార్టీ చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు 11మంది డాక్టర్లపై కేసు నమోదుచేశారు. అలాగే ఇద్దరు రిసార్ట్ మేనేజర్లను కూడా అరెస్టు చేశారు. ఈ ఘటన కరోనాతో అల్లాడుతున్న మహారాష్ట్రలో జరిగింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్న కారణంగా పూణేలో పదిరోజులపాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఆదేశాలను పక్కనబెట్టిన వైద్యులు శుక్రవారంనాడు బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. ‘లాక్డౌన్లో మూసేసి ఉండాల్సిన రిసార్టు అర్థరాత్రి తెరిచారని, దానిలో కొందరు వ్యక్తులు చేరి పార్టీ చేసుకుంటున్నారని సమాచారం అందింది. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం’ అని పోలీసులు తెలిపారు.