తెలంగాణలో కరోనాపై గుడ్న్యూస్ చెప్పిన మంత్రి కేటీఆర్
ABN , First Publish Date - 2020-03-29T23:36:47+05:30 IST
ఈ విషయాన్ని మీతో పంచుకోవడం సంతోషంగా ఉందని...
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్గా తేలిన 11 మందికి తాజా టెస్ట్ల్లో నెగిటివ్ వచ్చిందని.. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతేకాదు, తెలంగాణలో కరోనా బాధితులకు చికిత్సనందించేందకు కింగ్కోఠిలో 350 పడకల ఆసుపత్రిని పూర్తి అధునాతనంగా సిద్ధం చేసినట్లు మంత్రి ఫొటోలతో సహా షేర్ చేశారు. హైదరాబాద్లో నాలుగు ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు.
అంతేకాదు, జీహెచ్ఎమ్సీ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్లలో మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఉచితంగా అందించనున్నట్లు ఆయన తెలిపారు. శనివారం మధ్యాహ్నం 30వేల మందికి మధ్యాహ్న భోజనం, 7500 మందికి రాత్రి భోజనం.. 50 అన్నపూర్ణ క్యాంటీన్లలో ఉచితంగా అందించినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.