రాష్ట్రంలో కొత్తగా 114 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-01-17T08:16:22+05:30 IST
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,542 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 114 మందికి పాజిటివ్గా నిర్ధారణైంది.
అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,542 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 114 మందికి పాజిటివ్గా నిర్ధారణైంది. చిత్తూరు జిల్లాలో 24, కృష్ణా 12, గుంటూరు 6, శ్రీకాకుళం 6, విజయనగరం 3, అనంతపురం 3 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,85,824కి చేరింది.
కాగా, గడిచిన 24 గంటల్లో కరోనా మరణాలేమీ నమోదు కాలేదు. రాష్ట్రంలో మొత్తం మరణాలు 7,139. రాష్ట్రంలో కరోనా నుంచి 8,76,698 మంది కోలుకోగా, ప్రస్తుతం 1,987 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,25,40,181 సాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్యశాఖ శనివారం వెల్లడించింది.