కువైట్ నుంచి మంగళూరు చేరిన 114 మంది ఎన్నారైలు..
ABN , First Publish Date - 2020-08-13T18:37:06+05:30 IST
కరోనా లాక్డౌన్ వల్ల కువైట్లో చిక్కుకుపోయిన 114 మంది ఎన్నారైలు ప్రత్యేక విమానంలో మంగళూరు చేరుకున్నారు.
మంగళూరు: కరోనా లాక్డౌన్ వల్ల కువైట్లో చిక్కుకుపోయిన 114 మంది ఎన్నారైలు ప్రత్యేక విమానంలో మంగళూరు చేరుకున్నారు. బుధవారం రాత్రి 9.15 గంటలకు కువైట్ ఇంటర్నెషనల్ ఎయిర్పోర్టు నుంచి బయల్దేరిన చార్టెడ్ విమానం... గురువారం తెల్లవారుజామున మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే జూన్ 22న రావాల్సిన ఈ చార్టెడ్ విమానం డీజీసీఏ అనుమతి లభించకపోవడంతో అప్పుడు క్యాన్సిల్ అయింది. కాగా, స్వదేశానికి చేరుకున్న ప్రవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే... ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. అటు కువైట్లో కూడా విరుచుకుపడుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 73,785 మందికి సోకగా... 489 మందిని పొట్టనబెట్టుకుంది.