యూపీలో రానురానూ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా..

ABN , First Publish Date - 2020-07-08T21:58:20+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం...

యూపీలో రానురానూ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా..

లక్నో: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. యూపీలో తొలుత తక్కువ కేసులు నమోదయినప్పటికీ ఇటీవల కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లో గత 24 గంటల్లో 1,196 కరోనా కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ అమిత్ మోహన్ ప్రసాద్ వెల్లడించారు.


యూపీలో కరోనా మరణాల సంఖ్య 845. ఇప్పటివరకూ 20,331 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు అమిత్ మోహన్ ప్రకటించారు. యూపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29,968కి చేరింది. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,980.

Updated Date - 2020-07-08T21:58:20+05:30 IST