‘11వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలి’
ABN , First Publish Date - 2021-06-24T05:40:47+05:30 IST
పదకొండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ భాస్కర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నంద్యాల(ఎడ్యుకేషన్), జూన్ 23: పదకొండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ భాస్కర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నంద్యాలలోని ఏపీటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శివయ్య అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్రెడ్డి మాట్లాడుతూ 2018 జూలై నుంచి అమలు పరచాల్సిన 11వ పీఆర్సీని ఇప్పటి వరకు అమలు పరచకపోవడం దారుణమ న్నారు. పీఆర్సీతో పాటు డీఏ బకాయిలను వెంటనే ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. నిలుపుదల చేసిన మూడు విడతల డీఏను కేంద్ర ప్రభుత్వ తరహాలో విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రామచంద్రారెడ్డి, సుందర్రావు, రాజశేఖర్, నాగేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.