కల్తీ మద్యానికి 12 మంది బలి

ABN , First Publish Date - 2021-01-13T07:33:47+05:30 IST

కల్తీమద్యం తాగి మధ్యప్రదేశ్‌లోని మోరీనా జిల్లాలో 12 మంది చనిపోయారు. మరో ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. మోరీనా జిల్లాలోని మాన్పూర్‌,

కల్తీ మద్యానికి 12 మంది బలి

మధ్యప్రదేశ్‌లో ఘోరం


మోరీనా/భోపాల్‌, జనవరి 12: కల్తీమద్యం తాగి మధ్యప్రదేశ్‌లోని మోరీనా జిల్లాలో 12 మంది చనిపోయారు. మరో ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు.  మోరీనా జిల్లాలోని మాన్పూర్‌, పహావలి గ్రామంలోని సోమవారం రాత్రి కొందరు తెల్లటి రంగు మద్యం తాగినట్టు ప్రాథమిక నివేదిక ద్వారా తెలిసిందని  డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ) రాజేశ్‌ హింగాంకర్‌ మంగళవారం మీడియాకు తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురైనవారిని చికిత్సకోసం గ్వాలియర్‌కు తరలించారు.


ఈ దుర్ఘటనకు సంబంధించి కేసు నమోదుచేశామని, నిందితులు కొందరిని విచారించామని డీఐజీ చెప్పారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ను విధులనుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించారు. సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జిని సస్పెండ్‌ చేసినట్టు రాష్ట్ర హోంశాఖమంత్రి నరోత్తమ్‌ మిశ్రా చెప్పారు. 


Updated Date - 2021-01-13T07:33:47+05:30 IST