రాష్ట్రానికి 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్
ABN , First Publish Date - 2021-05-14T08:58:18+05:30 IST
ఒడిసా నుంచి 120 మెట్రిక్ టన్నుల ద్రవరూప ఆక్సిజన్(ఎల్ఎంఓ)తో బయలుదేరిన దక్షిణ మధ్య రైల్వే నాలుగో కంటైనర్ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ గురువారం రాత్రి నగరంలోని సనత్నగర్ గూడ్స్ షెడ్డుకు చేరింది
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): ఒడిసా నుంచి 120 మెట్రిక్ టన్నుల ద్రవరూప ఆక్సిజన్(ఎల్ఎంఓ)తో బయలుదేరిన దక్షిణ మధ్య రైల్వే నాలుగో కంటైనర్ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ గురువారం రాత్రి నగరంలోని సనత్నగర్ గూడ్స్ షెడ్డుకు చేరింది. ఇది ఆరు క్రయోజనిక్ కంటైనర్లతో ఆక్సిజన్ను తీసుకొచ్చిన మొట్టమొదటి ఎక్స్ప్రెస్ అని రైల్వే అధికారులు తెలిపారు. ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ 1,400 కిలోమీటర్ల గమ్యస్థానాన్ని 24 గంటల్లో చేరుకుందని తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రానికి మూడు ఎక్స్ప్రె్సలు ఆక్సిజన్ను తీసుకువచ్చాయని, ఇది నాలుగోదని పేర్కొంది.