యూకే నుంచి భారత్ చేరిన 1200 ఆక్సిజన్ సిలిండర్లు

ABN , First Publish Date - 2021-05-14T02:44:54+05:30 IST

కరోనా సెకండ్ వేవ్‌తో సతమతం అవుతున్న భారత్‌కు యూకే నుంచి వైద్య సాయం అందింది. తాజాగా బ్రిటన్ నుంచి 1200 ఆక్సిజన్ సిలిండర్లు భారత్‌కు చేరుకున్నాయి.

యూకే నుంచి భారత్ చేరిన 1200 ఆక్సిజన్ సిలిండర్లు

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్‌తో సతమతం అవుతున్న భారత్‌కు యూకే నుంచి వైద్య సాయం అందింది. తాజాగా బ్రిటన్ నుంచి 1200 ఆక్సిజన్ సిలిండర్లు భారత్‌కు చేరుకున్నాయి. కరోనా సమయంలో దేశాన్ని ఆక్సిజన్ కొరత పట్టిపీడిస్తున్న ఈ తరుణంలో ఇలా ఆక్సిజన్ సిలిండర్లు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ షిప్‌మెంట్‌ వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు. యూకే నుంచి వచ్చిన ఈ ఆక్సిజన్ సిలిండర్లను ఖతార్ ఎయిర్‌వేస్ భారత్‌కు చేర్చింది. ఈ సందర్భంగా యూకేకు ధన్యవాదాలు చెప్పిన అరిందమ్.. లాజిస్టిక్స్ సపోర్ట్ ఇచ్చిన ఖతార్ ఎయిర్‌వేస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బ్రిటిష్ ఆక్సిజన్ కంపెనీ నుంచి వచ్చిన ఈ షిప్‌మెంటు వచ్చింది. సోమవారం కూడా ఈ కంపెనీ నుంచి 1350 ఆక్సిజన్ సిలిండర్లు భారత్‌కు వచ్చాయి.

Updated Date - 2021-05-14T02:44:54+05:30 IST