123 కొత్త కేసులు
ABN , First Publish Date - 2020-10-24T11:11:08+05:30 IST
ఉమ్మడి పాలమూరులో శుక్రవారం 123 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అందులో అత్యధికంగా 58 కేసులు నాగర్కర్నూల్
కరోనాను జయించిన 27,282 మంది
మహబూబ్నగర్ వైద్యవిభాగం/ గద్వాలక్రైం/ నాగర్కర్నూల్/ వనపర్తి/ నారాయణపేట క్రైం, అక్టోబరు 23 : ఉమ్మడి పాలమూరులో శుక్రవారం 123 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అందులో అత్యధికంగా 58 కేసులు నాగర్కర్నూల్ జిల్లాలో నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో రెండు కేసులు మాత్రమే వచ్చాయి. కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం ప్రజలకు ఊరట కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం నాటికి 27,282 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- మహబూబ్నగర్ జిల్లాలో 37 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అందులో జిల్లా కేంద్రంలో 26, జిల్లాలోని వివిధ మండలాల్లో 11 కేసులు నమోదయ్యాయి.
- జోగుళాంబ గద్వాల జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. గద్వాల పట్టణంలో కేవలం రెండు కరోనా కేసులు నమోదు కాగా జిల్లాలోని మిగితా ప్రాంతాలలో 9 మంది కరోనా బారిన పడ్డారు.
- నాగర్కర్నూల్ జిల్లాలో 58 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో అధికంగా నాగర్కర్నూల్ మండలంలో 12, అచ్చంపేటలో 10 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇతర మండలాల్లో మరో 36 మందికి వైరస్ సోకింది.
- వనపర్తి జిల్లాలో 18 మంది కరోనా బారిన పడ్డారు. అందులో ఎక్కువగా వనపర్తి మండలంలో 12 కేసులు నమోదయ్యాయి.
- నారాయణపేట జిల్లాలో ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.