ఇటలీ నుంచి వచ్చిన విమానంలో 125 మందికి కోవిడ్-19 పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-06T21:07:33+05:30 IST
ఇటలీ నుంచి పంజాబ్లోని అమృత్సర్ వచ్చిన విమానంలో
అమృత్సర్ : ఇటలీ నుంచి పంజాబ్లోని అమృత్సర్ వచ్చిన విమానంలో ప్రయాణించిన 125 మందికి కోవిడ్-19 పాజిటివ్ అని గురువారం నిర్థరణ అయింది. అమృత్సర్ విమానాశ్రయానికి వచ్చిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ ఎయిరిండియా విమానంలో మొత్తం 179 మంది ప్రయాణించారు. ఈ వివరాలను ఈ విమానాశ్రయం డైరెక్టర్ వీకే సేఠ్ తెలిపారు.