ఏపీలో కొత్తగా 126 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-05-28T17:03:48+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి తగ్గట్లేదు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు.

ఏపీలో కొత్తగా 126 కరోనా కేసులు నమోదు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి తగ్గట్లేదు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 126 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపితే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,243కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో ఏపీకి సంబంధించినవి 54 ఉండగా.. ఫారిన్ నుంచి వచ్చిన వారిలో 111 మందికి పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా కొత్త కేసుల్లో ఎనిమిది కేసులు కోయంబేడుకు సంబంధించినవే. 


కాగా.. 24 గంటల్లో ఒకరు చనిపోయారు. చనిపోయిన వ్యక్తి కర్నూలు వాసి. ఇప్పటి వరకూ మొత్తం 59 మంది కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు-824గా ఉన్నాయి. కరోనాను జయించిన వారి సంఖ్య- 1,958. మొత్తం 9,858 శాంపిల్స్‌ను సేకరించగా ఈ కేసులు నమోదయ్యాయి.



Updated Date - 2020-05-28T17:03:48+05:30 IST