టెన్త్ పరీక్షలకు 127 కొత్త కేంద్రాలు
ABN , First Publish Date - 2020-05-17T10:20:31+05:30 IST
పదో తరగతి పబ్లిక్ పరీక్షల జూలై 10 తేదీ నుంచి ప్రారంభం కానున్న దృష్ట్యా జిల్లాలో కొత్తగా 127 పరీక్ష కేంద్రాలను
ఒంగోలువిద్య, మే 16 : పదో తరగతి పబ్లిక్ పరీక్షల జూలై 10 తేదీ నుంచి ప్రారంభం కానున్న దృష్ట్యా జిల్లాలో కొత్తగా 127 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 41,548 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం మొదట 188 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షా హాలులో విద్యార్థుల మధ్య కనీసం 4అడుగులు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా ఎంపిక చేసిన కేంద్రాలను పరిశీలనకు వేసిన నియోజకవర్గ స్థాయి కమిటీలు ఈనెల 17న నివేదికలు ఇవ్వాలని డీఈవో వీఎ్స.సుబ్బారావు శనివారం ఆదేశించారు.