12న మదురైలో ‘మోదీ పొంగల్’
ABN , First Publish Date - 2022-01-01T16:06:51+05:30 IST
రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో మదురైలో ఈ నెల 12న నిర్వహించనున్న పొంగల్ వేడుక ల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. మదురై విమానాశ్రయం సమీపంలోని మండేలా నగర్లో పార్టీ రాష్ట్ర
- హాజరుకానున్న ప్రధాని
పెరంబూర్(చెన్నై): రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో మదురైలో ఈ నెల 12న నిర్వహించనున్న పొంగల్ వేడుక ల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. మదురై విమానాశ్రయం సమీపంలోని మండేలా నగర్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, సీనియర్ నేతల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించనున్నారు. వేడుకల్లో 1,000 కుండల్లో పొంగళ్లు పెట్టే కార్యక్రమం చేపట్టనున్నారు. వందమంది నాదస్వర కళాకారులు, 50 జల్లికట్టు ఎద్దులు సహా పలు ప్రదర్శనలతో ప్రధానిని ఆహ్వానించనున్నారు. ఈ వేడుకల అనంతరం హెలికాప్టర్లో విరుదునగర్ 11 వైద్యకళాశాలల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు 12 మందితో కూడిన ప్రత్యేక కమిటీని రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసింది.