కరోనా కేసులు 13
ABN , First Publish Date - 2020-12-04T05:30:00+05:30 IST
జిల్లాలో కరోనా మరింత తగ్గుముఖం పట్టింది. శుక్రవారం కొత్తగా 13 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో వెల్లడించారు
కర్నూలు(హాస్పిటల్), డిసెంబరు 4: జిల్లాలో కరోనా మరింత తగ్గుముఖం పట్టింది. శుక్రవారం కొత్తగా 13 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. గత 24 గంటల్లో 6,276 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. దీంతో బాధితుల సంఖ్య 60,282కు చేరింది. ఇందులో 137 మంది వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 59,655 మంది డిశ్చార్జి అయ్యారు. జిల్లాలో కొవిడ్తో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, మరణాల సంఖ్య 487కు చేరింది.